కరీంనగర్ జిల్లా/ హుజరాబాద్: కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను గురువారం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రసత్య ప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో స్త్రీ శక్తి యొక్క ఔన్నతి గురించి మాట్లాడుతూ.. ఇక ముందు రానున్న కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ మహిళా అధ్యక్షులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 69











