+91 99635 77856

బూత్ అధ్యక్షుల సమ్మేళనం, సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం…

కరీంనగర్ జిల్లా/హుజరాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 12న రాష్ట్ర బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బూత్ అధ్యక్షుల సమ్మేళనం, సోషల్ మీడియా కార్యకర్తల సమావేశమునకు ముఖ్యతిధిగా కేంద్రహోంశాఖ మంత్రి అమితాషా పాల్గొని మార్గదర్శనము చేయనున్నా సమావేశం విజయవంతం కోసం హుజురాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షులు గంగిశెట్టి రాజు అధ్యక్షతన పట్టణ కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అద్యక్షులు గంగాడి కృష్ణ రెడ్డి హాజరై మాట్లాడుతూ … బూత్ అధ్యక్షులు,సోషల్ మీడియా సమ్మేళనం విజయవంతం కోసం ప్రతి ఒకరు కృషి చేయాలనీ కోరారు. సమావేశ అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జిల్లా ఆఫీస్ సెక్రెటరీ మాడుగుల ప్రవీణ్ కు నివాళులు అర్పించి..వారి ఆత్మ కు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ కన్వినర్ మాడ గౌతంరెడ్డి, జిల్లా కార్యదర్శి, పట్టణ ఇంచార్జీ నరసింహరాజు, జిల్లా అధికార ప్రతినిధి మాసాడి ముత్యం రావు, కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి, జిల్లా పదాధికారులు, పట్టణ కమిటీ నాయకులు, వివిధ మోర్చా అద్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు,బూత్ అద్యక్షులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !