+91 99635 77856

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ..

కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: మండలంలోని జూపాక గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు బుధవారం రెడ్డి సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు రూపిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టుదలతో క్రమశిక్షణతో కష్టపడి మంచి ఫలితాలు సాధించి ఉపాధ్యాయుల తల్లిదండ్రుల పేరు తీసుకురావాలని, మా పిల్లలు కష్టపడి ఉన్నత చదువులు చదివి ఈరోజు గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారని, మునుముందు పాఠశాలకు, విద్యార్థులకు విద్యా పరంగా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రూపిరెడ్డి రాజిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !