+91 99635 77856

దళితులపై దాడి చేసిన ఈటల రాజేందర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

– ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షులు తిప్పారపు సంపత్..
హుజురాబాద్/ఏప్రిల్ 08(మాఅక్షరం): రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దళితులపై దాడికి సూత్రధారి అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈటెల దళిత బాధితుల సంఘం అధ్యక్షులు తిప్పారపు సంపత్ డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్, హ్యూమన్ రైట్స్ డిజిపి కి ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రజాస్వామ్యబద్దoగా భారత రాజ్యాంగం ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ హక్కుతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ అరాచకాల పై మాట్లాడక ముందే ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సాక్షిగా మాజీ మంత్రి ఈటల అనుచరులు,బిజెపి మత శక్తులు ముకుమ్మడిగా దాడి చేయడం చాలా సిగ్గు చేటు అన్నారు. నీతులు చెప్పే ఈటల రాజేందర్ నిజస్వరూపం ఈ రాష్ట్ర ప్రజలకు మాపై జరిగిన దాడితో రుజువైందని తెలిపారు.ఈటల ఒక నరహంతకుడు అని అయన మంత్రిగా ఉన్న సమయంలో అనేక హత్యలు,అనేక అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఆయనకే దక్కుతుంది అని అన్నారు.ఈటల రాజేందర్ చేసిన అక్రమాలు అఘత్యాలపై మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని గడపగడపకు ప్రచారం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నమ్మిండ్ల రాజేశ్వర్, చల్లూరి రాహుల్,మేకల జానీ, రవితేజ,నరేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !