హుజురాబాద్/ ఏప్రిల్08(మాఅక్షరం): మండలంలోని చెల్పూర్-ఇంద్రనగర్ మార్గమధ్యలో ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం సోమవారం ఢీకొనగా వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం…
ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన ఇప్పలపల్లి రవీందర్(42)ఆర్ఎంపీగా వైద్యుడిగా పనిచేస్తూ బైక్ పై హుజురాబాద్ నుండి జమ్మికుంటకు వెళ్తున్న మార్గమధ్యలో ద్విచక్ర వాహనం ఢీకొనగా గాయాల పాలయ్యాడు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. అతడికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.
Post Views: 1,061











