హుజూరాబాద్/ఏప్రిల్ 12(మాఅక్షరం):కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అధ్వర్యంలో బిఆర్ఎస్ నేత, హుజురాబాద్ మునిసిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయకుమార్, మాజీ కౌన్సిలర్ కొయ్యడ శ్రీదేవి- కమలాకర్ గౌడ్, బిజెపి నాయకుడు పంజాల సతీష్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.శుక్రవారం మండలంలోని సింగపూర్ గ్రామంలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, తౌటం రవీందర్,యండి అఫ్సర్, సొల్లు బాబు, కౌర్ సుగుణాకర్ రెడ్డి, నేరెళ్ల మహేందర్, దేశిని కోఠి, దేశిని ఐలయ్య, సందమల్ల బాబు, సొల్లు దశరథం, బిఆర్ గౌడ్, సందమల్ల నరేష్, మేకల తిరుపతి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు, వల్గు తిరుపతి, గంట కిరణ్ రెడ్డి, ఉప్పరి చందు, టేకుల శ్రావణ్, బండ నవీన్, ముక్క రవితేజ, తదితరులు తదితరులు పాల్గొన్నారు.











