హుజురాబాద్/ ఏప్రిల్ 13(మాఅక్షరం): బి ఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన హుజురాబాద్ మాజీ ఎంపీటీసీ, మాజి కౌన్సిలర్ కొయ్యడ శ్రీదేవి, కమాలాకర్ శనివారం తిరిగి బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కమలాకర్ దంపతులు మాట్లాడుతూ.. కొంతమంది ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మాట వాస్తవమేనని, బిఆర్ఎస్ తోనే రాజకీయంగా ఎదిగానని, మళ్లీ గ్రహించి తిరిగి పార్టీలోకి వచ్చామన్నారు. పార్టీలోకి తిరిగి వచ్చిన తమకు ఎమ్మెల్యే సాగరంగా ఆహ్వానించారన్నారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తమకు పార్టీతో పాటు తాను కూడా నిత్యం అండగా ఉంటానని హామీ కూడా ఇచ్చారని అన్నారు.
Post Views: 341











