హుజురాబాద్/ఏప్రిల్14(మాఅక్షరం): ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన ఇప్పలపల్లి రవీందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీ విఘ్నేశ్వర ఆర్ఎంపి అసోసియేషన్ సభ్యులు రెండు క్వింటాళ్ళ బియ్యాన్ని ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కందగట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల సదానందం, కనబోయిన తిరుపతి, హుజురాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, రమేష్, రమణ చారి, గని రాజు, కార్తీక్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 146











