హుజూరాబాద్/ఏప్రిల్ 20(మాఅక్షరం) :
భారతీయ జనతా పార్టీ పట్టణ దళిత మోర్చా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న సిరిపాటి వేణు బీజేపీ పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యక్తి గత కారణాల వలన బీజేపీ పార్టీ సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు, ఈ రాజీనామా పత్రాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డికి అందజేసినట్లు తెలిపారు. ఇంత కాలం బీజేపీ పార్టీలో తనకు సహక రించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 73











