హుజురాబాద్/ఏప్రిల్21(మాఅక్షరం): అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో ఈరోజు హుజురాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ముక్క కృష్ణ మూర్తి మనవడు, డాక్టర్ నవీన్-స్వాతి కుమారుడు ముక్క నివేష్ (20) మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం… ముక్కనివేశ్ గత సంవత్సరం జనవరిలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అరిజోనా రాష్త్రం లోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ లో జాయిన్ కాగా నివేశ్ రెండో సంవత్సరం చేస్తున్నాడు. ఈరోజు కళాశాలకు వెళ్లి తిరిగి కారులో వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొనడంతో నివేష్ తో పాటుగా తన సహచర విద్యార్థి గౌతమ్ సైతం మృతి చెందినట్లు నివేష్ తెలిపారు.
Post Views: 255











