-కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల్లారా…. బీజేపీకి మద్దతివ్వండి…
-ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న..
-బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్…
హుస్నాబాద్/ఏప్రిల్21(మాఅక్షరం):దేశ ప్రగతి, రక్షణ ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనే సాధ్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. దేశ భవిష్యత్తు, సుస్థిర ప్రగతిని కోరుకునే వారంతా బీజేపీకే ఓటేయాలని పిలుపునిచ్చారు. స్థానిక, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎవరికి ఓటేసినప్పటికీ… దేశ భవిష్యత్తు కాంక్షించే కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులంతా పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి మద్దతివ్వాలని కోరారు.
భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు,మాజీ సర్పంచ్ రాచర్ల సారయ్య ఆదివారం సిరిసిల్లలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా బండి సంజయ్ సారయ్యతోపాటు ఆయన అనుచరులకు కాషాయ కండువా కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు…అనంతరం మాట్లాడుతూ.. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణమే పేదలకు అంకితం కావాలని సంకల్పం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ‘‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ,స్ఫూర్తితో ప్రజల జీవితాల్లో మార్పు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. మోదీ పాలనలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని, దళారుల ప్రమేయం లేకుండా దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలను నేరుగా పేదలు,రైతులు,మహిళలు,యువ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారని వివరించారు.ప్రతి గ్రామానికి కరెంటు, ఇంటింటికీ నల్లా నీరు చేరుతోందని, ఆయుష్మాన్ యోజన, జన్ ఔషధి కేంద్రం కోట్లాది మందికి వరంలా మారాయన్నారు. 4 కోట్ల మంది పేదలకు ఇండ్లు కట్టించడమే కాకుండా 30 లక్షలకుపైగా మరుగుదొడ్లు నిర్మించిన ఘనత మోదీదేనన్నారు.వీటితోపాటు అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ భారత్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నారని తెలిపారు.అయోధ్యలో రామ మందిర నిర్మాణం5వందల ఏళ్ల హిందువుల చిరకాల వాంఛను నెరవేర్చిన మహానుభావుడు నరేంద్రమోదని,370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ ప్రజలకు స్వాతంత్య్రం అందించిన నాయకుడు అన్నారు. ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళల సంకెళ్లను తెంచి స్వేచ్ఛను అందించిన నేతాని, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను కల్పించే దిశగా బిల్లును ఆమోదించిన మహనీయుడు, చంద్రయాన్-3 ద్వారా చందమామపై భారత త్రివర్ణ పతాకాన్ని గగన వీధుల్లో ఎగురవేసిన యోధుడు, G-20 సమావేశాలకు అధ్యక్షత వహించి విజయవంతంగా ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన లీడర్ అని కొనియాడారు. అలాంటి గొప్ప లీడర్ కు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతివ్వాల్సిన అవసరం ఉందన్నారు.ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని ఆర్కిడ్ ఆసుపత్రిలో రామడుగు మండలం గోపాలరావు పేట గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త ఫ్రుధ్వీరాజ్ ను బండి సంజయ్ పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఫ్రుధ్వీరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బండి సంజయ్ ఆయనను పరామర్శించడంతోపాటు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.











