హుజురాబాద్/ఏప్రిల్21(మాఅక్షరం): 200 జిలెటిన్ స్టిక్స్, పది డిటోనేటర్స్ వైరు ఆదివారం పట్టుకున్న పోలీసులు… పట్టణ సీఐ బొల్లం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. . మండలంలోని రాంపూర్ గ్రామం ఓలపు రమేష్ తన ఇంటి వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ప్రేలుడు పదార్థాలైన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ కలిగి ఉన్నాడని సమాచారంతో పోలీసులు అతని ఇంటి వద్దకు వెళ్ళగా అతని దగ్గర 200 జెలిటన్ స్టిక్స్,పది డిటోనేటర్స్ వైరు ఉండగా పట్టుకోవడం జరిగిందని, అతన్ని విచారించగా హుజురాబాద్ పట్టణానికి చెందిన తనకు తెలిసిన వ్యక్తి దగ్గర పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి దాని ద్వారా గుట్టలను పేల్చి క్రషర్లకు అక్రమంగా అమ్ముతున్నారని కాబట్టి అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు.
Post Views: 112











