హుజురాబాద్/ఏప్రిల్28(మాఅక్షరం): కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ఒడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం హరికృష్ణ ఆధ్వర్యంలో బిజెపి పట్టణ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు లంకదాసరి గంగరాజు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వొడితల ప్రణవ్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ముక్క మహేందర్, రామ్ నరేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా లంక దాసరి గంగరాజు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడే పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యమవుతుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 285











