+91 99635 77856

మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచులు..

-డాక్టర్ గుండేటి సునీత రాణి, లాయర్ జయకృష్ణ…
హుజురాబాద్/ఏప్రిల్30(మాఅక్షరం): తెలంగాణ రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమక్షంలో సైదాపూర్ మండలం ఎల్లంపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ డాక్టర్ గుండేటి సునీత రాణి, ప్రముఖ లాయర్ హుజురాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వే- సైదాపూర్ విశాల వ్యవసాయ సహకార సంఘం కార్యవర్గ సభ్యుడు ఎల్లంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గుండేటి జయకృష్ణ, మాజీ గ్రామ వార్డు సభ్యులు సంధి రాజిరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామాభివృద్ధి కొరకు గ్రామ ప్రజల సంక్షేమ కొరకు టిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరమని డాక్టర్ సునీత రాణి-జయకృష్ణలు తెలిపారు. వీరి చేరిక పట్ల ఎల్లంపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి సంపత్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ సభ్యులు కార్యకర్తలు సునీత రాణి జయకృష్ణ లకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సామాజిక సంస్థ నిర్వాహకురాలు కాంగ్రెస్ నాయకురాలు కర్ణ కంటి మంజులా రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ జునూతుల భాస్కర్ రెడ్డి మాజీ సర్పంచ్ కేశవైన ఐలయ్య గుజ్జులపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !