హుజూరాబాద్/ఏప్రిల్ 30(మాఅక్షరం) : జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన జన జాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా జమ్మికుంట సభకు వచ్చిన రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆరు గ్యారంటీలలో మహిళలకు ప్రాధాన్యత కల్పించడం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి మహిళల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత, జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న, కౌన్సిలర్ పిట్టల శ్వేత, మండల అధ్యక్షురాళ్ళు లంక దాసరి లావణ్య, కోడెం రజిత తదితరులున్నారు.











