+91 99635 77856

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి,తెలుగుదేశం పార్టీ నాయకులు…

హుజురాబాద్/ మే07( మా అక్షరం): మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంగళవారం బిజెపి పార్టీకి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గొడుగు సమ్మయ్య సమక్షంలో గొడుగు రాజశేఖర్,గొడుగు మొగిలి,బండారి మొగిలి బండి కుమార్, రిటైర్డ్ టీచర్ మొలుగూరి కొమురయ్య కు ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం తెలుగుదేశం నాయకులు ధర్మారం మాజీ సర్పంచి పాత సత్యం, మాజీ వార్డ్ సభ్యులు పాత సమ్మయ్య, పాత భాస్కర్,పాత రాజశేఖర్ విజయ గిరి విజయ్, మేడి మహేందర్ ఎండి సలీం, ఎం లింగారావ్ లను పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ… కరీంనగర్ పార్లమెంటు పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !