+91 99635 77856

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం…

-మీ ఇంటి బిడ్డను ఆదరించండి… కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి…
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్
వోడితల ప్రణవ్…
హుజురాబాద్/మే06(మాఅక్షరం): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం మండలంలోని సింగపూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మీ కంటి ముందు పుట్టి పెరిగిన బిడ్డను.. ఆదరించండి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండి అని అన్నారు. పుట్టి పెరిగిన గ్రామమైన సింగపూర్ లో కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళుతూ తాను మీ ఇంటి బిడ్డను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఓటు వేసి గెలిపించాలని సింగపూర్ గ్రామ ప్రజలను కోరారు. మీ మధ్యలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అందించే 6గ్యారంటీ స్కీములను అందరికీ అందేలా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని అన్నారు. రాముడి రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.ఆయన వెంట యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్, కొల్లురి కిరణ్,కిరణ్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు,,మహిళలు తదితరులు
పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !