సైదాపూర్/మే07(మాఅక్షరం ):తెలంగాణ రాష్ట్ర బీసీ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో సైదాపూర్ మండల సర్పంచులఫోరం మాజీ అధ్యక్షుడు వెంకేపల్లి మాజీ సర్పంచ్ కొండ గణేష్,బిఆర్ఎస్ పార్టీని వీడి మంగళవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు.మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు దొంతసుధాకర్,మాజీ జడ్పీటీసీ గుండారపు శ్రీనివాస్,గొడిశాల మాజీ సర్పంచ్ పోగు రమేశ్, గ్రామ శాఖ ఆధ్యక్షుడు వెల్దిరాజు,మ్యాకలరాజు,గడ్డంస్వామి,కచ్చురవి,గడ్డంశేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 156











