+91 99635 77856

క్యాన్సర్ తో పోరాడి మృతి చెందిన రఘు..

-అనాధలైన ఇద్దరు చిన్నారులు..
-కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి..

హుజురాబాద్ /జూన్ 05(మా అక్షరం): ఆ కుటుంబాన్ని విధి ఆడుకుంది.. ఎంతో అల్లారుముద్దుగా చిన్న పిల్లలను చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి ని క్యాన్సర్ కబళించింది. దీంతో ఆ చిన్నారులు అనాధలయ్యారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డిపో సమీపంలో గాజుల రఘు (38) గత కొన్నాళ్ళు గా క్యాన్సర్ తో పోరాడుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. రఘు ఓ ప్రైవేట్ కళాశాలలో బోధన చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. రఘు తండ్రి సోడాలు అమ్ముతూ కుటుంబానికి ఆసరా గా నిలిచేవారు. అతను కూడా అనారోగ్యం పాలయ్యారు. రఘు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అల్ముకున్నాయి ఆ కుటుంబానికి ఆసరా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం ఉంది. రఘు కు సంవత్సరం పాప, రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నారు.చేతిలో ఉన్న డబ్బులు రఘు చికిత్స కు అయిపోగా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొంది. అంత్యక్రియలకు ఇతరుల పై ఆధారపడే పరిస్థితి. దాతలు, ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి ఆర్థిక సహాయం చేయాలనుకునేవారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటుంది. ఫోన్ పే, గూగుల్ పే 9966008681 ( గాజుల రఘు) భార్య రజిత

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !