+91 99635 77856

మానవత్వం చాటుకున్న ప్రమోద్, ఉదయ్..

– బస్సులో 2 లక్షలు దొరకగా పోలీసులకు అప్పగింత..
హుజూరాబాద్/ జూలై 24(మా అక్షరం): అర్టీసీ బస్సులో దొరికిన డబ్బులను పోలీసులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు విలాసాగరం ప్రమోద్, మొర ఉదయ్ కుమార్ పోలీసులు వివరాల ప్రకారం… బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన విలాసాగరం ప్రమోద్, రేకొండకు చెందిన ఉదయ్ కుమార్ బుధవారం సాయంత్రం పరకాల నుంచి హుజురాబాద్ కు ఆర్టీసీ బస్సులో వచ్చి హుజూరాబాద్ బస్టాండ్ లో దిగుతుండగా ముందు సీట్లో కవర్ కన్పించింది. ఆ కవర్లో డబ్బులు ఉండటాన్ని గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. కాగా నిజాయితీగా దొరికిన డబ్బులను అప్పగించడం పట్ల పోలీసులు, పలువురు ప్రయాణికులు యువకులు ప్రమోద్, ఉదయ్ కుమార్ ను అభినందించారు. డబ్బులు పొగొట్టుకున్న వ్యక్తులు పూర్తి ఆధారాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి తీసుకోగలరని ఎస్సై యూసఫ్ అలీ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !