+91 99635 77856

మృతుల కుటుంబాలను పరామర్శించిన బండి సంజయ్…

 

హుజురాబాద్/ఆగస్టు11(మా అక్షరం): పురపాలక సంఘం పరిధిలోని ఇప్పనర్సింగాపూర్ లో ఇటీవల మరణించిన బిజెపి నాయకుడు పల్లె శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్నీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి పరామర్శించి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే బిజెపి నాయకుడు గొట్ట రవీందర్ తల్లి ఇటీవల అకాల మరణం చెందారు.వారి కుటుంబాన్ని సైతం పరామర్శించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి,పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !