ఎల్కతుర్తి/ఆగస్టు13 (మా అక్షరం): మండలం లోని రైతు వేదికలో ప్రభుత్వము నుండి మంజూరు చేయబడిన 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు, ఎమ్మార్వో, ఎంపీడీవో చేతుల మీదుగా లబ్ధిదారులకు దాదాపు మండలంలోని 12 గ్రామాలకు గాను 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 91 మంది 91,50,000 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఏఈఓ, ఎంపీ ఓ, వ్యవసాయ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ పొన్నం యువసేన తంగళ్ళపల్లి రమేష్, బత్తిని రవీందర్ గౌడ్, వివిధ గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులు, మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు











