+91 99635 77856

ఎమ్మెల్సీ కవిత బెయిల్ మంజూరు పై బీఆర్ఎస్ సంబరాలు..

-ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచింది..
-ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్..
హుజురాబాద్/ ఆగస్టు 27(మా అక్షరం): ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి రిమాండ్ చేసి ఐదు నెలల తర్వాత బెయిల్ రావడంతో హుజురాబాద్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు.ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ లు మాట్లాడుతూ…బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, జైలు కొత్త కాదని ఎవరిని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ఔన్నత్యాన్ని తగ్గించలేరని అన్నారు. కుట్రపూరితంగా కవితను జైలుకు పంపినప్పటికీ చివరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి దూరం చేయడం ఎవరికి సాధ్యం కాదని, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల మధ్యలో అనే విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు.రానున్న రోజుల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతామని, ఇకపై వచ్చే ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్,అపరాధ ముత్యం రాజు, కొండ నరేష్, ఇమ్రాన్, ముక్క రమేష్ కేశిరెడ్డి లావణ్య, మారేపల్లి సుశీల, డాక్టర్ ఐలయ్య, ఒంటెల రాజిరెడ్డి, సమ్మయ్య, పంజాల శ్రీధర్, సారయ్య లతో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !