+91 99635 77856

మానేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ప్రణవ్..

 

కరీంనగర్/ హుజురాబాద్: సెప్టెంబర్ 4(మా అక్షరం): గత మూడు రోజులుగా కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కరీంనగర్ లోని ఎల్ఎండి ప్రాజెక్టు నిండుకుండలాగా మారిందని,ఎల్ఎండి అధికారులు ఏ క్షణమైన గేట్లు తెరిచే అవకాశం ఉన్నందున మానేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ కోరారు.మానేరు పరివాహక మండలాలైన వీణవంక,జమ్మికుంట మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లకూడదని అన్నారు.ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని కోరారు.ప్రభుత్వం నుండి కావలసిన అన్ని సహాయ కార్యక్రమాలు అందేలా ఇప్పటికే అధికారులతో సంప్రదించామని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !