+91 99635 77856

దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం అందజేయాలి

-క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలి…
-ఏ ఒక్క రైతు కూడా నష్టపోవద్దు..
-రైతులకు నష్టం జరిగినట్లయితే రైతుల పక్షాన ధర్నా రాస్తారోకోలు నిర్వహిస్తాం…
-రైతు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్…

ఎల్కతుర్తి/సెప్టెంబర్06(మా అక్షరం):
మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చూడాలని రైతు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ శుక్రవారం డిమాండ్ చేశారు. మండలంలో ఏ ఒక్క రైతు కూడా నష్టపోవద్దు అని పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు పదివేల రూపాయల నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు చూడాలని కోరారు. ఎక్కడ నష్టం జరిగిందో ప్రభుత్వం గుర్తించి క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వం కు నివేదిక ఇవ్వాలని సూచించారు. పంట నష్టపోయిన ఏ ఒక్క రైతుకు నష్టం జరగద్దని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాలోని రైతులందరూ కలిసి ప్రభుత్వం తగు న్యాయం చేయాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !