హుజురాబాద్/ జమ్మికుంట: సెప్టెంబర్09(మా అక్షరం): జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్ ఇంచార్జి సూపరింటెండెంట్ గా సోమవారం డాక్టర్ పారిపెల్లి శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంచార్జి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వనరులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, భవిష్యత్తులో ఉన్నత అధికారుల దృష్టికి ఈ హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మేము, మా సిబ్బంది పని చేస్తామని, దానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతం హుజూరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో సర్జన్ గా విధులు నిర్వహిస్తున్నానని కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శ్రీకాంత్ రెడ్డి ఇన్చార్జి సూపరింటెండెంట్ కావడం పట్ల పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.











