హుజురాబాద్/ సెప్టెంబర్30(మా అక్షరం): సబ్ డివిజన్ పరిధిలో గల 2136 కేసులను లోక్ అదాలత్ లో పరిష్కారానికి కృషి చేసిన కోర్టు డ్యూటీ ఆఫీసర్లను హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి సోమవారం తన కార్యాలయంలో అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డివిజన్ పరిధిలోని రెండువేల పైచిలుకు కేసులను సంబంధిత వ్యక్తులతో మాట్లాడి లోక్ అదాలత్ కు వారిని తీసుకువెళ్లి ఆ కేసుల పరిష్కారానికి పోలీసులు తమ మీద బాధ్యత వేసుకొని పనిచేశారన్నారు. సిడిఓ లా పనితీరు బేష్ అని కితాబిచ్చారు.ఇదే పనితీరును పోలీసులు శాంతి భద్రతల విషయంలో కూడా ఉండాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదే లేదని, వాటికి భంగం కలిగితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్,రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సిఐ వరగంటి రవి,జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్,ఎస్సైలు యూనస్ అహ్మద్ అలీ, సిహెచ్ తిరుపతి,తోట తిరుపతి తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.











