హుజురాబాద్/ అక్టోబర్ 27(మా అక్షరం): దీపావళి సందర్భంగా హుజురాబాద్ లోని దీపావళి టపాసుల యూనియన్ నూతన కార్యవర్గం ఆదివారం స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బుర్ర కుమార్ గౌడ్ ఎన్నికవ్వగా ఉపాధ్యక్షుడిగా మంచికట్ల గౌతమ్ కుమార్ కోశాధికారిగా శివనాధుని భరత్ కుమారులు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం ఎన్నిక పట్ల సభ్యులందరూ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. తనపై నమ్మకం నుంచి అధ్యక్షుడుగా ఎన్నుకున్న సభ్యులందరికీ తన సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు భూపతి లక్ష్మయ్య,కోడితల నాగరాజు,జమాలపూర్ అనిల్,మొలుగు భానుచందర్, గుండ్ల నరేందర్ ,కే కిరణ్ కుమార్, కిషోర్ కుమార్, ప్రేమ్, పాల్గొన్నారు బన్నీ మైస, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 102











