+91 99635 77856

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో విద్యకు అధిక ప్రాధాన్యత…

– ప్రభుత్వం డైట్,కాస్మోటిక్ చార్జీలు పెంచడం హర్షదాయకం…
– దీపావళికి విద్యార్థులకు ప్రభుత్వం కానుక…
-కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్..
హుజురాబాద్ నవంబర్ 03 (మా అక్షరం): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని,పేద విద్యార్థులు నాణ్యమైన విద్య అందుకోవాలనేదే తమ ప్రభుత్వ అభిమతమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ప్రభుత్వ హాస్టల్లో చదివే పేద విద్యార్థిని,విద్యార్థులకు ప్రతినెల చెల్లించే డైట్,కాస్మోటిక్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు.ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.గత ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి నిధులు కేటాయించకుండా అనేక ఇబ్బందులు గురి చేసిందని గుర్తుచేశారు.తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల సమస్యలు ఒకొకటిగా తీరుస్తూ వారికి అండగా ఉంటూ,విద్యారంగంలో ఉద్యోగాల కల్పనలో ముందు ఉంటామని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !