కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 03(మా అక్షరం):హైదరాబాద్కు చెందిన ఆరిగపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ వారు…స్వర్గీయ లయన్ ఎ.కృష్ణకుమారి స్మారకంగా కళా,సాహిత్యం,సినిమా,సేవారంగాలకు చెందిన నిష్ణాతులైన వారిని జాతీయ పురస్కారాలకు ఎంపికచేయగా.. కరీంనగర్కు చెందిన కాసనగొట్టు స్వప్నకృష్ణ సాహిత్య విభాగంలో జాతీయస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.ఆమె ఆదివారం ఈ అవార్డును హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లయన్ ఎ. విజయకుమార్, విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రజినీ,తెలుగు వన్ ఫౌండేషన్ అధినేత కంఠంనేని రవిశంకర్ మరియు ఇతర అతిథుల చేతుల మీదుగా అందుకోగా…బంధు మిత్రులందరూ స్వప్నకృష్ణకు అభినందనలు తెలిపారు.
Post Views: 119











