కరీంనగర్,తిమ్మాపూర్/నవంబర్ 08 (మా అక్షరం న్యూస్):తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను రాముల పాదాల చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, స్వీటు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ..కాంగ్రెస్ పార్టీని తెలంగాణ గడ్డ మీద అధికారంలోకి తెచ్చిన వీరుడు రేవంత్ రెడ్డి అని అన్నారు.అలాగే సమగ్ర కుటుంబ సర్వే కుల గణన చేసి అన్ని కులాలకు జనాభా దామాషా ద్వారా రిజర్వేషన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాడని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా మరొక సారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు, నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తున్న అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











