+91 99635 77856

ఘనంగా గ్యార్మీ జెండా పండుగ వేడుకలు..

హుజూరాబాద్/ నవంబర్09(మా అక్షరం): పట్టణంలోని మామిళ్ల వాడలో ముస్లింల పవిత్ర పండుగ గ్యార్మీ జెండా పండుగ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. జండా గద్దే నుంచి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై జెండాను ఉంచి పట్టణంలోని వాడవాడ నా ఊరేగించి తిరిగి జండా గద్దెకు చేర్చారు. ముస్లిం యువతీ యువకులు జెండా ఎదుట ప్రత్యేక నృత్యాలు చేస్తూ సంతోషంగా ఆడి పాడారు. జెండాను పలువురు ప్రముఖులు సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్శించిన వారిలో హుజురాబాద్ డివిజన్ మజీద్ ఈద్గా ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మత గురువులు మహమ్మద్ అలీమ్. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణయ్ బాబు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, రెండో వార్డ్ కౌన్సిలర్ బర్మావత్ యాదగిరినాయక్, ఉజ్మానూరిన్ ఇమ్రాన్, గఫర్, మిలాత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !