హుజురాబాద్/ నవంబర్ 11(మా అక్షరం): రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వివరాల్లోకి వెళితే… సోమవారం మండలంలోని సింగపూర్ గ్రామ సమీపంలో మానకొండూరు మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ తన కుటుంబంతో ద్విచక్ర వాహనం పై కరీంనగర్ వైపు వెళుతుండగా ద్విచక్ర వాహనం పై నుండి అదుపుతప్పి కింద పడగా వెనుక నుండి వస్తున్న లారీ మధ్య భాగాన పడింది. లారీ డ్రైవర్ సడన్ బ్రేకులు వేసి ఆపగా లారీ మధ్య భాగాన ఇరుక్కుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతిని అదే సమయంలో ములుగు పర్యటనకు వెళ్తున్న బండి సంజయ్ ఈ ప్రమాదాన్ని గుర్తించి… హుటాహుటిన తను ఆగి అటువైపు వెళుతున్న లారీలను ఆపి వారి దగ్గర నుంచి జాకీలు కత్తెరలు తెప్పించి స్థానికుల సహాయంతో ఆ యువతుని కాపాడారు. అనంతరం గాయాలు పాలైన యువతని కరీంనగర్ లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స కయ్యే ఖర్చు మొత్తం తానే చెల్లిస్తానని ఆస్పత్రి వైద్యులకు తెలిపారు











