హుజురాబాద్/నవంబర్ 12(మా అక్షరం): మండలంలోని చెల్పూర్ గ్రామంలో విద్యుత్ అధికారులు పోల్ టు పోల్ తనిఖీలు మంగళవారం చేశారు. ఈ తనిఖీలో భాగంగా హుజురాబాద్ రూలర్ ఏఈ జనార్ధన్ మాట్లాడుతూ… ప్రతి ఇంటికి మీటర్ ద్వారానే విద్యుత్ వాడుకోవాలని వినియోగదారులకు సూచించారు. విద్యుత్ మీటర్ లేని కుటుంబాలకు 938 రూపాయలకే మీటర్ ఇవ్వడం జరుగుతుందని వినియోగదారులు దీన్ని తప్పకుండా వినియోగించుకోవాలని అన్నారు. చట్ట వ్యతిరేకంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఏఈ రాములు,ఏ ఈ లు సంపత్ రెడ్డి, రఘు చారి,ఫోర్ మెన్ సంజీవరావు, ఎస్ ఎల్ ఐ రాజిరెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ రామంచ సమ్మయ్య ,శ్రీనివాస్, లైన్మెన్లు ఐలేష్, కనకయ్య, ఏ ఎల్ ఎం లు అంబాల వెంకటేశ్వర్లు, శరత్ రెడ్డి, తిరుపతి, గణేష్, చింతల్ మహేందర్ పాల్గొన్నారు
Post Views: 188











