హుజురాబాద్/నవంబర్12(మా అక్షరం): పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో పట్టణ సంస్థగత ఎన్నికల వర్క్ షాప్, పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు కొమురయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధిష్టానం ఆదేశాల మేరకు బూత్ స్థాయి ఆ పై నాయకులు తమ రిఫరల్ కోడ్ పై 100 సభ్యత్యాలు తప్పకుండ నిర్థిష్ట సమయం లో పూర్తి చేయాలనీ కోరారు.బూత్ అధ్యక్షులు నియమించడానికి నాయకులు కార్యకర్తలు సంసిద్ధం కావాలని కోరారు.ప్రతి కార్యకర్త పార్టీ కోసం సంస్థగతంగ పని చేయాలని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిజెపి జిల్లా పదాధికారులు, పట్టణ నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 50











