+91 99635 77856

పేదింట్లో పుట్టినరోజు జరుపుకున్న పోరెడ్డి శంతన్ రెడ్డి..

-పద్మశాలి కుటుంబానికి 50కేజీ ల బియ్యం వితరణ..
హుజురాబాద్/నవంబర్12(మా అక్షరం): పట్టణానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు జైరెడ్డి ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు పోరెడ్డి శంతన్ రెడ్డి తన పుట్టిన రోజు దినాన్ని పేద పద్మశాలి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. పట్టణములోని 22 వార్డులో గల బత్తుల ప్రకాష్, అన్నపూర్ణ కుటుంబం ఇంటికి వెళ్ళి వారి ఇంటిలోనే బర్త్ డే కేక్ కట్ చేసిన శంతన్ రెడ్డి… వారి పిల్లలకు కేకును తినిపించారు…ఈ సందర్బంగా 50కేజీల బియ్యాన్ని వారికీ వితరణ చేసారు. ఈ సందర్బంగా శంతన్ రెడ్డి మాట్లాడుతూ… సమాజంలో జన్మ దినం,వివాహ దినోత్సవాల సందర్బంగా ప్రయోజన చేకూర్చని కార్యక్రమాలకు వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారని పేదలకు చేయూత అందించే కార్యక్రమాలను చేపడితే ఆత్మతృప్తి దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర ఐక్య వేదిక కార్యదర్శి కుడికాల సాయి, సీనియర్ జర్నలిస్ట్ అల్లి నరేందర్, పోరెడ్డి స్ఫూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !