– ఇద్దరు బీహార్ కూలీలు మృతి..
– మరొకరు కారు డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి...
కరీంనగర్, తిమ్మాపూర్/నవంబర్ 15 (మాఅక్షరం):కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కూలీలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కరీంనగర్ నుంచి ఓవర్ స్పీడ్ తో వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందరు. కారులో వెళ్తున్న వ్యక్తి బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో టోల్గేట్ అంబులెన్స్ లో కరీంనగర్ లోని ఒక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటరెడ్డి మృతి చెందారు.సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై వివేక్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
Post Views: 151











