-ఆలయ ప్రధాన అర్చకులు సదా నిరంజన్ సిద్ధాంతి…
ఎల్కతుర్తి నవంబర్ 15 (మా అక్షరం): మండలంలోని వల్బపూర్ గ్రామంలో శుక్రవారం రోజున పశుపతినాథ్ స్వామి దేవాలయం శ్రీ క్రోది నామ సంవత్సరం ధక్షణయానం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయంలో హట్టహాసంగా పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి
ఈ కార్యక్రమంలో భాగంగా పుణ్యా వచనం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉదయం 6 గంటల నుండి గణపతి పూజ మహా మంగళ హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగం అత్యంత భక్తిశ్రద్ధలతో వేద పండితుల ఆశీర్వాదాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి గణపతి పంచామృత అభిషేకం నందీశ్వరునికి అభిషేక పూజ శ్రీ పశుపతినాథ్ స్వామివారికి పంచామృత సహిత రుద్రాభిషేకలు నిర్వహించి సాయంత్రం ఆకాశ దీప పూజా కార్యక్రమాలకు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీప దర్శనం చేసుకుని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు గ్రామంలో ప్రజలందరూ పాడిపంటలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు గంజి భావనారుషి-విజయ, పోల్నెనీ రామరావు- రమాదేవి, పొనగంటి శ్రావణ్ రావు, అంబాల వేణుగోపాల్,పూజిత,క్షేత్రజ్ఞ, దగ్గు వసంత, కోడెం జ్యోతి, శ్రీదేవీ, చిర్ర రేణుక, ఉమాదేవి, అంబాలా నవీన్, సుదర్శన్, కరుణాకర్ భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.











