హుజురాబాద్/నవంబర్16(మా అక్షరం): ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన మండలంలోని పోతిరెడ్డి పేట గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం గ్రామంలోని వ్యవసాయ పొలంలో కొయ్యకాళ్ళను అంటించిన రైతులు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న గడ్డివాము పై నిప్పులు పడి గడ్డివాము దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు.దాదాపు రైతులకు రూ80.000వేల ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు.
Post Views: 91











