+91 99635 77856

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన గౌడ సంఘం నాయకులు

కరీంనగర్, మానకొండూర్ నవంబర్ 16 (మా అక్షరం):మానకొండూర్ మండలంలోని పచ్చునూరులో గురువారం తాటి చెట్టు పైనుండి కింద పడి మృతి చెందిన గీత కార్మికుడు ముడగాని కనకయ్య కుటుంబాన్ని కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్గొండ తిరుపతి గౌడ్ పరామర్శించి తమ సానుభూతిని వ్యక్తం చేశారు.కనకయ్యకు బార్య , ముగ్గురు కూతుర్లు,ఒక కుమారుడు ఉండగా కల్లు గీత వృత్తితో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని ,కనకయ్య మృతితో ఆ కుటుంబ పరిస్థితి అందకారంగా మారిందని ప్రభుత్వం కనకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల రాములు, మానకొండూర్ మండల నియోజకవర్గ ఇన్చార్జ్ గోపగోని నవీన్ గౌడ్, సంఘం మండల అధ్యక్షుడు మూడగోని అనిల్ గౌడ్, పంజాల సదానందం, పప్పు సంపతి గౌడ్ , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !