హుజురాబాద్/నవంబర్ 19(మా అక్షరం):పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం భారత దేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ..ఇందిరాగాంధీ ఆలోచన ప్రజలకు న్యాయం చేయాలి, గరిబి హటావో, బ్యాంకుల జాతీకరణ, అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉక్కు మహిళాగా పరిపాలన దక్షతగా ఇంద్ర గాంధీ పాలించారని
ప్రపంచంలోనే తనకంటూ ఒక గుర్తింపు తీసుకొని వచ్చారని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల పట్టణ కాంగ్రెస్,నాయకులు,మహిళ నాయకురాల్లు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.
Post Views: 81











