కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 19 (మా అక్షరం):అన్న మృతిని తట్టుకోలేక ఓ చెల్లి గుండె ఆగింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ప్యాట ఎల్లయ్య(70) అనారోగ్యంతో హైదరాబాద్ లోని నీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మంగళవారం దహన సంస్కారాల్లో ఎల్లయ్య చితికి నిప్పు పెట్టుతున్న క్రమంలో ఎల్లయ్య చెల్లెలు నాగం రాజవ్వ అన్న మృతిని తట్టుకోలేక మృతదేహం మీద పడి ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది.ఈ సంఘటనను చూసిన ఇరువురి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. తన అన్న లేడన్న నిజాన్ని తట్టుకోలేక తాను మరణించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Post Views: 216











