హుజురాబాద్/నవంబర్ 20(మా అక్షరం): పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను బుధవారం ఎసిపి శ్రీనివాస్ జి సందర్శించారు. అనంతరం బ్యాంకులలో సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాల స్థితిగతులను బ్యాంకు మేనేజర్లను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకులలో ఉండే సీసీ కెమెరాల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతరం పనిచేసే విధంగా చూసుకోవాలని ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనబడితే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆయన వెంట పట్టణ సీఐ తిరుమల్ బ్యాంకు సిబ్బంది ఉన్నారు.
Post Views: 226











