హుజురాబాద్/నవంబర్20 (మా అక్షరం): ప్రమాదవశాత్తు వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన ఘటన బుధవారం పట్టణ పరిధిలోని బోర్నపల్లిలో విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన నక్క కుమార్ తల్లి నక్క సరోజన (58) ఆదివారం బయటికి వెళ్ళింది.ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా బోర్నపల్లి చెరువులో శవమై కనిపించింది. కాగా ప్రమాదవశాత్తు ఆమె చెరువులో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది.ఈ విషయమై కుమారుడు నక్క కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Post Views: 214











