హుజురాబాద్/నవంబర్ 28(మా అక్షరం): సామాజిక సంఘ సేవకర్త స్వర్గీయ మహాత్మ జ్యోతిరావు పూలే 134 వ వర్ధంతి వేడుకలు గురువారం జరిగాయి. పట్టణంలోని జమ్మికుంట రోడ్డు లో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి జ్యోతిరావు పూలే కమిటీ చైర్మన్, అంబేద్కర్ వాదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడుగు , బలహీన వర్గాల అభివృద్ధి మహిళల సాధికారతకు కృషి చేశారన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, పట్టణ సిఐ తిరుమల్ గౌడ్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ ఖలీద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోల్లు బాబు మరియు యేముల పుష్పలత,మిడిదొడ్డి రాజు,రత్నం వేల్పుల ప్రభాకర్ రామ్,రాజేశ్వర్, బొంగు రవీందర్, ఎర్రబోజు నారాయణ, కొలిపాక సమ్మయ్య, బండారి సదానందం, తునికి రవి, యండి రియాజ్, మేకల మొగిలయ్య, మొలుగు శ్రీధర్, ఇల్లెందుల సమ్మయ్య, చందుపట్ల జనార్దన్, మోరె తిరుపతి, వేణు, ప్రతాప నాగరాజు, సొల్లు సునిత, ఎస్ కె జలీల్, గొస్కుల మధుకర్, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.











