ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాన మంత్రి ఫొటోను కూడా పెట్టాల్సిందే…
– తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి..
కరీంనగర్, తిమ్మాపూర్/నవంబర్28(మా అక్షరం):రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఫొటోను ఎలాగైతే పెట్టారో అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను కూడా అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేసారు.ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలను తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ విజయ్ కుమార్, మండల పరిషత్ కార్యాలయం లో పర్యవేక్షకులు శ్రీనివాస్ లకు గురువారం అందించారు. ముఖ్య మంత్రి ఫొటో లను పెట్టినట్లుగానే ప్రధాని ఫొటోలను పెట్టాలని పేర్కొన్నారు.చట్టాలను గౌవించడం తో పాటుగా రాష్ట్ర, దేశ ముఖ్యమైన నాయకులను గౌరవించుకోవడం ప్రజల యొక్క భాద్యతగా పేర్కొన్నారు.జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర,మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతి రెడ్డి,ఉపాధ్యక్షులు పబ్బ తిరుపతి,బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్,కానుగంటి మధుకర్ రెడ్డి,సుద్దాల సతీష్,పున్నం అంజయ్య, బండి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.











