– ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సులు..
కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 28 (మా అక్షరం):
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ బ్రిడ్జి వద్ద గురువారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. కరీంనగర్ నుండి జమ్మికుంట వెళ్తున్న ఆర్డినరీ బస్సు బ్రిడ్జి దిగుతున్న క్రమంలో వెనకాలే వస్తున్న కరీంనగర్ నుండి కోహెడ వెళ్తున్న మరో ఆర్డినరీ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టడంతో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వాహన రద్దీని క్రమబద్ధీకరించి ఘటనకు గల కారణంపై ఆరా తీశారు.
Post Views: 105











