-వ్యక్తి పై కేసు నమోదు..
కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 28 (మా అక్షరం):తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలను దూషించిన బిజెపి మాజీ మండల అధ్యక్షుడు కేతిరెడ్డి అంజిరెడ్డి పై బుదవారం యువజన కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయగా గురువారం ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో నాయకులు ఎఫ్ఐఆర్ నమోదు ప్రతిని తీసుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ..ఇకనుండి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులను విచక్షణ కోల్పోయి మాట్లాడినా, సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నబోయిన రవి పోలంపల్లి మాజీ ఎంపీటీసీ బండారి రమేష్,ప్రధాన కార్యదర్శి ఎం డి ఆశిక్ పాషా. సోషల్ మీడియా కోఆర్డినేటర్ వరుకోలు శ్రీనివాస్ పాల్గొన్నారు.











