కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 29 (మా అక్షరం):తిమ్మాపూర్ మండలం అలుగునూరులో బిఆర్ఎస్ పార్టీ నవంబర్ 29ని దీక్షా దివాస్ గా జరుపుకుంటూ జిల్లావ్యాప్తంగా భారీ సభను ఏర్పాటు చేశారు.ఈ సభకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ…..తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్ అని 2001 మే 17న కరీంనగర్ లో జరిగిన సింహ గర్జన తోనే కెసిఆర్ గురించి దేశం మొత్తం తెలిసిందని 2006లో ఎక్కడుంది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు రెండు లక్షల ఓట్లతో సమాధానం చెప్పి పునర్జన్మనిచ్చిన గడ్డ కరీంనగర్ అని 2009లో తెలంగాణ వాదం మాసిపోతున్న క్రమంలో ఇదే కరీంనగర్ గడ్డపై నా శవయాత్రనో లేక తెలంగాణ జైత్రయాత్రనో అని కెసిఆర్ మళ్లీ ఇదే ఆలుగునూరులో నిరాహార దీక్ష చేయడంతో కరీంనగర్ గడ్డ ఉద్యమానికి ఊపిరి పోసిందని ఉద్యమంలో పాల్గొన్న వారికి కేటిఆర్ పేరుపేరునా వందనాలు తెలియజేశారు.











