హుజురాబాద్/ నవంబర్ 29(మా అక్షరం): పట్టణంలోని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో 68వ అండర్14 ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలను శుక్రవారంహుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల గౌడ్ ప్రారంభించారు.క్రీడాకారులను పరిచయం చేసుకొని హాకీ పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హుజరాబాద్ హాకీ కి పుట్టినిల్లు లాంటిదని. హుజురాబాద్ నుండి ఎంతోమంది రాష్ట్రస్థాయి జాతీయస్థాయి క్రీడాకారులను అందించిన ఘనత హుజురాబాద్ కి దక్కుతుందన్నారు.60 సంవత్సరాల కెళ్ళి హుజురాబాద్లో హాకీ క్రేజ్ తగ్గలేదన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, పలు పార్టీ నాయకులు పాల్గొన్నారు
Post Views: 249











